|   |   |   |   |   |   | 
  హంసిని రెండవ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
 


"నందన" నామ సంవత్సర ఉగాది సందర్భంగా హంసిని నిర్వహించిన ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో సుమారు ఎనభై మంది రచయితలు పాలుపంచుకున్నారు. వీరందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి మాకు సహాకరించిన ప్రముఖ రచయితలకు మా ధన్యవాదాలు. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో బాటు, ప్రచురణార్హమైన ఇతర రచనలు హంసినిలో మే సంచికనుండి వరుసగా ప్రచురింపబడతాయి. అన్ని రచనలపై సర్వహక్కులూ రచయితలవే. ఒక వారం రోజుల్లో బహుమతులు మెయిల్ లో పంపించబడతాయి.

ఉత్తమ కవిత విభాగం విజేతలు:
“వై థిస్ కొలవరి కొలవరి డీ” - గరిమెళ్ళ నాగేశ్వరరావు (మొదటి బహుమతి $51 నగదు పారితోషికం)
“వర్షం.....!! నా బయోగ్రాఫర్!!” – వాసుదేవ్ (రెండవ బహుమతి $51 నగదు పారితోషికం)
“మట్టి - మరికొన్ని ప్రశ్నలు...” - సిరికి స్వామినాయుడు (మూడవ బహుమతి $51 నగదు పారితోషికం)

ప్రశంసాపత్రం పొందిన కవితలు:
“నిత్య ప్రయాణికుడు” - రామకృష్ణ రెడ్డి (ప్రశంసాపత్రం)
“నేను మనిషిని” - స్వాతీ శ్రీపాద (ప్రశంసాపత్రం)
“చిలుకలు వాలే చెట్టు” - మానస చామర్తి (ప్రశంసాపత్రం)
“ఇల్లే ఒక తాజ్ మహల్” - అల్ల౦ వీరయ్య (ప్రశంసాపత్రం)
“మాతృ గ్రహమే…” - డా. గరిమెళ్ళ నారాయణ (ప్రశంసాపత్రం)
“అవిటి హృదయం” – అరుణ్ (ప్రశంసాపత్రం)


ఉత్తమ కథానిక విభాగం విజేతలు:
"మయసభ" - స్వాతి శ్రీపాద (మొదటి బహుమతి $116 నగదు పారితోషికం)
"అర్దనారీశ్వరం" - పారుపూడి సత్యనారాయణ (రెండవ బహుమతి $51 నగదు పారితోషికం)
"మహాకాపాలిని" - లక్ష్క్మీ గాయత్రి (మూడవ బహుమతి $51 నగదు పారితోషికం)

ప్రశంసాపత్రం పొందిన కథానికలు ($15 నగదు పారితోషికం, ప్రశంసాపత్రం):
“ఆకర్షణ” - జొన్నలగడ్డ రామలక్ష్మి
“సంఘమిత్ర” - మానస చామర్తి
“త్వమేవాహమ్” - చాట్రాతి అనిల్ కుమార్ - మానస
“ఒక ఉషస్సు కోసం జాగారం” - అరిపిరాల సత్యప్రసాద్
“తిమింగిలం” - పి.వి. శేషారత్నం
“రమణి సూపర్ మార్కెట్” - కే.బి కృష్ణ
“దస్త్రమా నీ మందమెంత?” - పి.వి.రమణారవు -ఎలక్ట్రాన్
“ఎట్రాక్షన్” – సత్యప్రకాష్

ఈ రచనల పోటీలో పాల్గొన్న వారందరికీ పేరు పేరునా మరొక్క సారి మా ధన్యవాదాలు.