 |
|
|
|
|
| |
ఈ సంచికలో...
1. ఆపరేషన్ గ్రీన్ హంట్ - మూడవ భాగం (సీరియల్) - భోగెల
2. అర్దనారీశ్వరం (కథానిక) - పారుపూడి సత్యనారాయణ
3. సంఘమిత్ర (కథానిక) - మానస చామర్తి
4. వర్షం.....!! నా బయోగ్రాఫర్!! (కవిత) - వాసుదేవ్
5. మాతృ గ్రహమే… (కవిత) - డా. గరిమెళ్ళ నారాయణ
6. ప్రభంజననం (కవిత) - జోగారావ్
7. అపర అన్నపూర్ణ (వ్యాసం) - డాక్టర్.మంతెన సూర్యనారాయణ రాజు
8. పరాన్నభుక్కుల పాలిట (వ్యాసం) - గుండాన జోగారావ్ |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ఈ సంచికలో...
1. ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - రెండవ భాగం (వ్యాసం) - ఎస్.వి.రామారావు
2. మంచు పుష్పం (కథానిక) - శ్రీమతి బులుసు సరోజినీ దేవి
3. ఆపరేషన్ గ్రీన్ హంట్ - రెండవ భాగం (సీరియల్) - భోగెల
4. నిత్య నూతనంగా.. (కవిత) - స్వాతీ శ్రీపాద
సంపాదకీయం:
మాత్రుభాషా సముద్దరణే కర్తవ్యంగా భావించి ఒక మాస పత్రిక రాబోతుంది.... |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ఈ (జనవరి) సంచికలో:
1. ఆపరేషన్ గ్రీన్ హంట్ (సీరియల్) - భోగేల
2. ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - మొదటి భాగం (వ్యాసం) - 'సినీ విజ్ఞాన విశారద' ఎస్.వి.రామారావు
3. ఈ నెల కొత్త పుస్తకాలు - సంపాదకులు
4. ఆమె.. నేనూ.. (కవిత) - కేక్యూబ్ వర్మ
5. విముక్తి! (కవిత) - రవి వీరెల్లి
6. విలువ (కధానిక) - హరిప్రియ నోరి
బుడిబుడి అడుగులేస్తూ చూస్తుండగానే మన హంసిని మాస పత్రిక మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. |
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ఈ సంచికలో:
1. పడమటి సూర్యుళ్ళు (కథానిక) - సమ్మెట ఉమాదేవి.
2. ఇక్కడో.. (కవిత) - కేక్యూబ్ వర్మ
3. వర్షాంజలి (పుస్తక పరిచయం) - భోగెల
వినాయక చవితి, రుషి పంచమి, బౌద్ధ జయంతి, ఉపాధ్యాయుల దివసం,తదితర పండగలతో శుభప్రదంగా గడిచింది సెప్టెంబర్ నెల.
విద్యల నగరంగా పేరొందిన విజయనగరం లో 21 వ తేదీన
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ఆగష్టు అపురూపమైన మాసం. అరవై అయిదవ భారత స్వతంత్ర దివసం, రవీంద్రనాథ్ టాగోర్ నూట ఏభై వర్ధంతి, విజయవాడ లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు తదితరమైనవి జరిగాయి. 12/8/11 కలకత్తా లో సాహిత్య అకాడెమి ఆద్వర్యం లో కవి సమ్మేళనం జరిగింది. దేశం నలు మూలల నుండి సుమారు 24 రాష్ట్రాల నుండి కవులు, కవయిత్రులు హాజరయ్యారు. తమ తమ భాషల్లో రాసుకొని వచ్చిన కవితలను చదివారు.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ప్లాట్ ఫాం మీద రైలుబండి నిలబడి ఉంది. ప్రయాణీకులతో బోగీలు కిక్కిరిసి ఉన్నాయి. వాళ్ళంతా కవులు,కధకులు,సాహితీవేత్తలు. ఇంజను కూత వేసి ముందుకు కదిలింది. అంతవరకూ ట్రైన్ ఎక్కాలని ప్రయత్నిస్తున్న ఒకామె విఫలురాలయి అలానే ఉండిపోయింది.
'ఎవరమ్మా నువ్వు' ఎందుకు ఆగిపోయావు? అడిగారెవరో ఆమెను.
'నేను....నేను.... సాహిత్య సరస్వతిని' అందామె.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
అన్ని రంగాలలో ముందున్న భారత్, కరప్షన్ లో కూడా చాలా ముందుంది. పని జరగక నిస్సహాయ స్థితిలో కొందరు, పని త్వరగా జరిపించుకోడానికి మరి కొందరు.. ఇలా ఈ రోజుల్లో లంచం సమర్పించుకోవడం అనేది సర్వ సాధారణమైన విషయం. అయితే లంచం కోసం పీడించి పీడించి లంచం ఇస్తే తప్ప పని చేయను అనే ఉద్యోగుల సంఖ్య కన్నా, తమ స్వార్ధం కోసం టైముకు పని జరిపించుకోవాలని లంచం ఇచ్చి ప్రోత్సహించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా నేరమే. ...
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
'మేము ఒక ఋతువులో కనిపించే పువ్వులం కాదు.
ఎన్నికల ముందు మాత్రమే ప్రజలకు కనిపించే కోయిలలము కాదు.
పసిడి తల్పం నుంచి రాజకీయాలు నడిపే నేతలము కాదు.
మండే ఎండల్లో ...తుఫాను వానల్లో ప్రజల పక్ష్యాన నిలిచి పోరాడే వాళ్ళము' ఈ మాటలన్నది ఎవరో కాదు. మూడున్నర దశాబ్దాల కమ్యునిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి విజయకేతనం ఎగరవేసిన ఫైర్ బ్రాండ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీది మమతా బెనర్జీ. రాజకీయాలకు రాకముందే ఆమెకు కవిత్వం అంటే కడు కండూతి. అదే బాటలో పయనించిన పురచి తలైవి జయలలితకు చదవడం మంచి హాబీ.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
తెలుగు కధకు నూరేళ్ళు నిండాయి. కాదు...ఎంతమాత్రమూ కాదు. నూరేళ్ళ పుట్టినరోజు పండగ జరుపుకొంటుంది. హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటికి వచ్చిన కధలు, కవితలు ఇందుకు నిదర్శనం. ఎన్నెన్నో దిన,వార,పక్ష,మాస పత్రికలూ, వెబ్ పత్రికలూ ఉగాది సందర్భాన పోటికి కధలు, కవితలు ఆహ్వానించినా మా అంచనాలను తారుమారు చేస్తూ రచయితలు, రచయిత్రులు దేశ, విదేశాలనుండి ఉత్సాహంగా హంసిని రచనల పోటికి స్పందించారు. ఆ సాహితీ ప్రేమికులకు మేము పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. కధల్లో, కవితల్లో రాశి పెరిగింది అట్లనే వాసి కూడా పెరిగింది. ఒక మంచి పనికి పాఠకుల సహాకారము సదా ఉంటున్నదన్న హామీ స్పష్టంగా తెలుస్తోంది.
హంసిని ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలను ప్రకటించాం. పోటీ ఫలితాల కోసం 'ఉగాది ఉత్తమ రచనల పోటీ' బానర్ ను క్లిక్ చేయండి.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది సందర్భంగా హంసిని నిర్వహించిన ఉత్తమ రచనల పోటీ ఫలితాలు మే 8న హంసినిలో ప్రకటిస్తాము. పోటీలో పాల్గొన్న రచయితలందరికి ఈమెయిలు ద్వారా కూడా తెలియజేస్తాము. పోటీ ఫలితాలు ప్రకటించడంలో జరుగుతున్న ఆలస్యానికి మన్నించగలరు.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
ఈ సీజన్ లో ఎక్కడికెళ్ళినా వస్తుంది దగ్గు, జలుబు కాని బరంపురం వస్తే వస్తుంది తెలుగు. బరంపురం లో అమ్మవారి పండగలు రెండేళ్లకొకసారి జరుగుతాయి.కానీ ఇక్కడ బరంపురం లో ఆంధ్ర భాష సమాజం లో ఈ మూడు రోజులు సంగీత సరస్వతి కి సాహితి, సంస్కృతీ ఉత్సవాలు జరిగాయి. పొట్టి శ్రీరాములు యూనివెర్సిటీ ఆద్వైర్యంలో గత నేల 3,4,5 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన తెలుగు సాహితి సంస్కృతీ మహోత్సవాల వేదిక కొత్త పెళ్లి కూతురిలా కళ కళ లాడింది. అలానే 11,12 తేదిల్లో హైదరాబాదు నగరంలో రవీంద్ర భారతిలో అఖిల భారత తెలుగు రచయిత్రుల సమ్మేళనం జరిగింది. వీటిని కేంద్ర సాహిత్య అకాడెమీ, ఆంధ్రప్రదేశ్ శాఖ, లేఖిని మహిళా చైతన్య సాహితి సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆద్వైర్యంలో జరపడం ముదావహం.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
శీతకం శీర్ణమయింది. రధసప్తమి నుండి భానుడు చండ ప్రచండుడై వీర విహారం చేసే సమయం ఆసన్నమయింది. దేశం యావత్తు వేడి గాలుల రాక తో వేడెక్కి పోవడం ఖాయం. కానీ ఆంధ్ర దేశం ఇప్పటికే వేడెక్కి ఉంది.రాష్ట్ర విభజన, ఉద్యోగస్తుల సమ్మెలు, స్కాములు, భూకుంభ కోణాలు, ఉగ్రవాదం, అర్దికపరమైన లోటు లాంటి సమస్యలతో రాష్ట్రం అట్టుడికి పోతుంది.
తెలుగు భాషాభివృద్ది పరిరక్షనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయడం, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం వొత్తిడి నూతన సంవత్సరంలో రాబోయే కొత్త పరిణామాలు అని ఆశిద్దాం. పొరుగు రాష్ట్రాలు, దేశాల్లోని భాషా సంస్కృతులను గురించి మట్లాడు కోవడం కంటే మనని మనం సంస్కరించుకోవడం, ఆత్మవిమర్శ చేసుకోవడం ప్రధమ కర్తవ్యం.
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
నట్టింట ధాన్యలక్ష్మి గలగలలు, రంగవల్లుల హరివిల్లులు, గొబ్బెమ్మల అలంకరణలు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు, భోగిపండ్ల స్నానాలు... ప్రతీ గడప సరికొత్త శోభనుసంతరించుకొన్న సందడి... అదే సంక్రాంతి. శ్రీ వికృతి నామ సంవత్సరంలో ప్రకృతి అందరినీ చల్లగా చూడాలి, సస్య లక్ష్మితో పాటు సాహితి సరస్వతి కూడా ప్రతి తెలుగువారింట నర్తించాలి, అప్పుడే శాంతి ... ప్రశాంతి.
హంసిని మొదటి సంచికను ప్రసంసిస్తూ ప్రతీ అంశాన్ని సునిశిత ద్రుష్టితో చదివి ఆత్మీయంగా పాఠకులు పంపిన అభినందనలు మాకెంతో ఆనందాన్ని కలుగజేసాయి. ఈ సహకారంతో మున్ముందు విభిన్న అంశాలతో హంసినిని ముస్తాబు చేసి మీ ముందు ఉంచబోతున్నాము. ..
|
|
| పూర్తిగా ... |
|
|
|
| |
రెండు వేల సంవత్సరముల చరిత్ర కలిగిన తెలుగు భాష ఏ పండిత ప్రకాండుల పుణ్యవశానో ఒక్కసారిగా ఊడి పడలేదు. ప్రజల నోళ్ళల్లో పదాలుగా పాటలుగా ఉద్భవించి చెలంచెలుగా విస్తరించి తర్వాతర్వాత సాహిత్యక్రమ పరిణామానికి మార్గం ఏర్పరిచింది. సహితస్య హితం సాహిత్యం. సామాజిక సంస్కారాన్ని పెంచేది సత్ సాహిత్యమే. ఏ దేశ సాహిత్యం అయినా ఆ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వుంటుంది. సమ కాలీన పరిస్థితులకు అద్దం పడుతూవుంటుంది. సాహిత్యం యొక్క అసలైన ప్రయోజనమూ పరమార్ధమూ కూడా అదే. వచన సాహిత్యం కంటే ముందు పద్య సాహిత్యమే పుట్టి విస్తరించింది.
|
|
| పూర్తిగా ... |
|
|
|
|